Telugu Gateway
Telangana

అపార్ట్ మెంట్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య

అపార్ట్ మెంట్  పై నుంచి దూకి యువతి ఆత్మహత్య
X

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం. గురువారం ఉదయమే ఓ యువతి అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవటం ఆ ప్రాంతంలో అందరినీ షాక్ కు గురిచేసింది. అయితే ఆమె తనంతట తాను దూకిందా? లేక ఎవరైనా నెట్టారా? అన్న కోణంలో పోలీసులు పరిశీలన చేస్తున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూజ అంబికా (21) తండ్రి ఏడుకొండలు, తల్లి శమంతకమణి. వీరికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.

స్థానికంగా వీరు చందానగర్ రాజీవ్ స్వగృహ లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా దంపతులిద్దరూ టైలరింగ్ చేస్తారు. వీళ్ళ అమ్మాయి అయిన అంబిక బి.టెక్ కంప్యూటర్స్ చదువుకుంటూనే ఓ ఆన్ లైన్ ట్రేడింగ్ కంపెనీలో పనిచేస్తోంది. గురువారం ఉదయం అయిదున్నర గంటల ప్రాంతంలో అందరూ వాకింగ్ కి వెళ్లే సమయంలో రాజీవ్ స్వగృహ లోని తన అపార్ట్ మెంట్ పై దూకి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

Next Story
Share it