పీఎం కేర్స్ కు ఎస్ బి పెరల్ ప్రాజెక్ట్స్ విరాళం
BY Telugu Gateway4 April 2020 9:09 AM GMT
X
Telugu Gateway4 April 2020 9:09 AM GMT
కరోనాపై పోరుకు తమ వంతు సాయం అందజేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న, మధ్యతరహా సంస్థలు కూడా తమ వంతు సాయాన్ని పీఎం కేర్స్ కు అందజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఎస్ బి పెరల్ ప్రాజక్ట్స్, గోకులనందన కార్పొరేషన్ ల తరపున కంపెనీ అధినేత ముత్యాల సత్తిబాబు ఏభై వేల రూపాయలను పీఎం కేర్స్ ఖాతాకు శనివారం నాడు బదిలీ చేశారు. కరోనాపై పోరులో ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న కఠినమైన చర్యలు ఎంతో ఉపయోగంగా ఉన్నాయిని, ఈ క్లిష్ట సమయంలో తన వంతు సాయం అందించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సత్తిబాబు తెలిపారు.
Next Story