Telugu Gateway
Andhra Pradesh

జగన్ కు మోడీ ఫోన్

జగన్ కు మోడీ ఫోన్
X

ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో ఆయన అంశంపై చర్చించారు. కరోనా కేసుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మోడీ సూచించారు. అదే సమయంలో సీఎం జగన్ కూడా ప్రభుత్వపరంగా కరోనా ను ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యలను ప్రధాని మోడీకి వివరించారు. దేశంలో కరోనా వెలుగు చూసిన రోజుల్లో ఏపీలో నామమాత్రంగా ఉన్న కేసుల సంఖ్య గత వారం రోజులుగా అనూహ్యంగా పెరుగుతూ పోతోంది.

ఇప్పుడు ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 252కు పెరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై కూడా మోడీ ఆరా తీసి తగు సూచనలు చేసినట్లు చెబుతున్నారు. జగన్ అంతకు కరోనా అంశంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి జిల్లాలోనూ కరోనా టెస్టింగ్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకురావాలని, ఇప్పుడున్న ల్యాబ్ ల సామర్థ్యం పెంచాలని పేర్కొన్నారు. ప్రతి ఆస్పత్రిలో విధిగా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story
Share it