Telugu Gateway
Andhra Pradesh

కర్నూలులో కరోనా కల్లోలం..కొత్తగా 26 కేసులు

కర్నూలులో కరోనా కల్లోలం..కొత్తగా 26 కేసులు
X

ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లోనే ఇక్కడ 26 కేసులు వెల్లడి కావటం జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీలో కొత్తగా 44 పాజిటివ్ కేసులు రాగా..ఒక్క కర్నూలు జిల్లాలోనే 26 కేసులు రావటం విశేషం. తాజాగా నమోదు అయిన 44 పాజిటివ్ కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 647కు పెరిగింది. ఇందులో 65 మంది డిశ్చార్జి అయితే ..17 మంది మరణించారు. కొత్తగా వచ్చిన కేసులతో ఏపీలోనే అత్యధిక కేసులు ఉన్న జిల్లాగా కర్నూలు నిలిచింది. ఇక్కడ ప్రస్తుతం 158 కేసులు నమోదు అయ్యాయి.

ఆ తర్వాత స్థానంలో గుంటూరు జిల్లా ఉంది. అక్కడ 129 కేసులు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 75 కేసులు నమోదు అయ్యాయి. ఇక్కడ కొత్తగా ఆరు కేసులు వెలుగుచూశాయి. విశాఖపట్నంలో కొత్తగా ఒక పాజిటివ్ కేసు వచ్చింది. తూర్పు గోదావరిలో ఐదు, గుంటూరులో మూడు కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల కాలంలో కరోనా నుంచి కోలుకుని 23 మంది డిశ్చార్జి అయ్యారని ఏపీ హెల్త్ బులెటిన్ లో తెలిపారు.

Next Story
Share it