Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో మరో 80 పాజిటివ్ కేసులు

ఏపీలో మరో 80 పాజిటివ్ కేసులు
X

గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా మరో 80 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వీటిలో సింహభాగం గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లోనే ఉన్నాయి. కొత్తగా గుంటూరులో 23 కేసులు, కృష్ణాలో 33, కర్నూలులో 13 కేసులు వెలుగుచూశాయి. శ్రీకాకుళంలో కూడా కొత్తగా మరో కేసు వచ్చింది. కొత్తగా వచ్చిన 80 కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1177కు పెరిగింది. 235 మంది ఇఫ్పటికే డిశ్చార్జి కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 911గా ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో 6517 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

Next Story
Share it