ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు
BY Telugu Gateway22 April 2020 11:40 AM IST

X
Telugu Gateway22 April 2020 11:40 AM IST
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 813కు పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 56 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటికే 120 మంది డిశ్చార్జి అయి వెళ్లిపోయారు. 24 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 669. కొత్తగా వచ్చిన 56 కేసుల్లో గుంటూరులో 19, కర్నూలులో 19 కేసులు ఉండటం విశేషం. చిత్తూరులో ఆరు, కడపలో ఐదు,కృష్ణాలో మూడు,ప్రకాశంలో నాలుగు కొత్త కేసులు వెలుగుచూశాయి.
గత కొన్ని రోజులుగా గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ పోతోంది. తాజాగా వచ్చిన కేసులతో కలుపుకుంటే కర్నూలులో మొత్తం కేసులు 203కు చేరగా..గుంటూరులో 177కు పెరిగాయి. గత 24 గంటల్లో 5757 శాంపిల్స్ ను పరీక్షించగా..అందులో 56 పాజిటివ్ గా తేలాయి.
Next Story