Telugu Gateway
Telangana

ఆర్దిక వ్యవస్థను రికవరీ చేయోచ్చు..కానీ ప్రాణాలు రికవరీ చేయలేం

ఆర్దిక వ్యవస్థను  రికవరీ చేయోచ్చు..కానీ ప్రాణాలు రికవరీ చేయలేం
X

లాక్ డౌన్ కొనసాగించాల్సిందే..ఇది ఒక్కటే మార్గం

అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి

డాక్టర్లు..మునిసిపల్ సిబ్బందికి ప్రోత్సాహకాలు..కెసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ లాక్ డౌన్ కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఉద్దేశం అయితే ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలనేదే తన అభిప్రాయం అని..ఇంతకు మించి భారత్ ముందు మరో మార్గంలేదన్నారు. ‘ఆర్ధిక వ్యవస్థను అందరూ కలసి కష్టపడి రికవరి చేసుకోవచ్చు. కానీ ప్రజలు ప్రాణాలు పోతే రికవరి చేయలేం’ ఈ విషయాన్ని గుర్తించే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. కెసీఆర్ సోమవారం నాడు ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు. తన అభిప్రాయం కోరితే మరో రెండు వారాల వరకూ లాక్ డౌన్ పొడిగించాలనే చెబుతానన్నారు. లాక్ డౌన్ తొలగించటం అంటే చాలా ఇబ్బందులు వస్తాయన్నారు. రైళ్లు స్టార్ట్ చేస్తమా?. బస్సులు, విమానాలు స్టార్ట్ చేస్తామా? ఎక్కడ ఆగుతాము. ఎవరిని ఆపుతాం. ఇది అంత తేలికైన విషయం కాదు. నేను మనసులో ఉన్న మాట దాచుకోను. ప్రజాహితాన్నికోరే చెబుతున్నారు.

రాష్ట్రానికి 2400 కోట్లు వచ్చే చోట ఆరు కోట్లే వచ్చింది. అయినా సరే ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకునే తాను లాక్ డౌన్ కొనసాగించాలని కోరుతున్నట్లు తెలిపారు. అమెరికా లాంటి ధనిక దేశంలో శవాల గుట్టలు గుట్టలగా పేరుకుపోతున్నాయి ట్రక్ లలో శవాలు పంపిస్తున్నారు, శవాల దిక్కు లేదు,అన్నింటిలో ముందు ఉన్న దేశం అమెరికా ఇంత దారుణంగా ఉంది. మన దేశంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారు వాళ్ళ ద్వారా ఇతరులకు సోకిన వారు 25937 మందిని క్వారంటైన్ చేశాం. ఇందులో 50 మందికి కరోన పాజిటివ్ వచ్చింది వాళ్ళ నుండి వారి కుటుంబ సభ్యులకు సోకించారు,ఇందులో ఒక్కరు కూడా చనిపోలేదు,ఇందులో 35 మంది వ్యాధి ని నుండి కొలుకున్నారు ఇందులో ఎవరు కూడా సీరియస్ గా లేరు. క్వారయింటైన్ లో ఉన్న వారు రేపటికి అందరూ అయిపోతారు.

అందులో ఉన్నవారికి డిశ్చార్జ్ చేస్తాం 9వ తేదీ వరకు పాతవారు వెళ్ళిపోతారు. మధ్యలో వచ్చిన నిజాముద్దీన్ కేస్ లు దేశం మొత్తం కూడా అతలాకుతలం చేశారు. మొత్తం 364 మందికి సోకింది. ఇండోనేషియా వాళ్ళు కూడా 10 మంది డిశ్చార్జ్ అయ్యారు.11 మంది చనిపోయారు. గాంధీ లో 308 మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు,నిజముద్దీన్ 1089 మందిని పట్టుకున్నాం.30 నుండి 35 మంది ఢిల్లీలో ఉంటారు. వారికి అక్కడే ట్రీట్మెంట్ చేసి ఉంటారు. ఇందులో 170 మందికి వైరస్ వచ్చింది చనిపోయిన వారు కూడా ఇందులో వారే. 170 మంది ద్వారా 90 మందికి వచ్చింది అందరిని కూడా పట్టుకున్నారు సుమారు 3015 మందిని పట్టుకున్నారు. అందరూ కూడా ఒకే మతం వారు లేరు ,హిందువులు కూడా ఉన్నారు.308 హాస్పిటల్ లలో ఉన్నారు.1000 కిపైగా జబ్బు లేదు. ఇంకా కొంత మందికి టెస్ట్ లు జరుగుతున్నాయి. వచ్చే రెండు,మూడు రోజుల్లో అన్ని పరీక్షలు వస్తాయి.వీళ్లా ద్వారా ఎవరికి అయిన సోకిందా అని వేట కొనసాగుతుంది.ఇంటలిజెన్స్ చాలా కష్టపడ్డారు వారికి అభినందనలు. 308 మంది కాకుండా ఇంకో 110 వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ వరకు ఆగిపోతుంది అని దేవుణ్ణి కోరుతున్నా.

లాక్ డౌన్ ను ప్రజలు చాలా సహకారాన్ని అందించారు ఇంకా సహకారం ఇవ్వాలి.ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాలు లాక్ డౌన్ చేశాయి. మిగతా 90 దేశాలు పాక్షికంగా లాక్ డౌన్ చేశాయి,సమస్య ఎంత తీవ్రంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రం మన రాష్ట్రంతో పాటు దేశం చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాం . నిజాముద్దీన్ ఘటన లేకపోతే తెలంగాణ ఆరాంగా ఉండేది. ప్రముఖ సంస్థ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ఓ నివేదిక తయారు చేసింది. వాళ్ళ లెక్క ప్రకారం జూన్ 3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలి చెప్పారు. జూన్ 3 వరకు ఇండియాలో పీక్ వరకు వెళ్తుంది అని చెప్పారు.మన లాంటి దేశాలు లాక్ డౌన్ పాటించాలి అని చెప్పారు అంతే తప్ప గత్యంతరం లేదు. ఒక్కరు చనిపోతేనే ఇల్లు మొత్తం దిక్కులేకుండా పోతుంది కాబట్టి లక్షల్లో చనిపోతే ఎలా?. కష్టం లో కన్నీళ్లు పంచుకునే వారు కావాలి ,మేడ్చల్ లో ఒక్క ఆమె ఆమెకు వచ్చిన బియ్యం లో కొన్ని ఇతరులకు ఇచ్చింది అలాంటి వారికి జూన్ 2 నాడు సన్మానం చేసి అవార్డ్ ఇస్తాం. మోడీ ఏదో పిలుపునిచ్చారు దాన్ని కూడా వెకిలి చేష్టలు చేశారు.జాతి ఐక్యత కోసం ఇచ్చారు .తెలంగాణ ఉద్యమంలో నేనే వందల పిలునిచ్చాను అప్పుడు కూడా నేను గంటలు కట్టాలని చెప్పాను.అప్పుడు కూడా వెదవగాళ్ళు ఏవేవో అన్నారు. తమ ప్రాణాలు తెగించి వారికి కూడా వైరస్ సోకవచ్చు.వైద్య సేవలు అందిస్తున్న వారి అందరికి చేతులు ఎత్తి దండం పెడుతా. వైద్య సిబ్బంది ,ఇతర ల్యాబ్,శానిటేషన్ సిబ్బంది కి మనం ధైర్యం చెప్పాలి. వైద్య అన్నింటికి సిద్ధంగా ఉన్నాం,కోవిడ్ పాజిటివ్ వచ్చిందో వారిపై కఠిన చర్యలు ఉంటాయి. కోవిడ్ కు 8 హాస్పిటల్ లు గుర్తించాం. ఎవరికి పాజిటివ్ వచ్చిన గాంధీ హాస్పిటల్ లో ఉండాలి. వైద్యశాఖ లో మొత్తం జీతం ఇవ్వాలని చెప్పాను అధికాకుండా వైద్య సిబ్బంది కి సీఎం గిఫ్ట్ కింద 10 శాతం ఇవ్వాలని చెప్పాను. పల్లె ప్రగతి ద్వారా సగం దారిద్ర్యం పోయింది.సర్పంచ్ లు చాలా బాగా పనిచేస్తున్నారు. జీహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బందికి 7500 అందిస్తాం,మున్సిపల్ గ్రామాల్లో పనిచేసిన వారికి 5000 ఇస్తున్నాము. తల్లిదండ్రుల తరువాత కన్నా పారిశుద్ధ్య కార్మికుల గొప్పవారు.

సఫాయి అన్న మీకు సలాం. కొన్ని పత్రికలు ఇంకా కూడా వక్రబుద్ది తో రాస్తున్నాయి ,డాక్టర్ లకు సేఫ్టీ కిట్ లు లేవు అని. మీకు తెలుసా 40 వేల కిట్స్ ఉన్నాయి. ఇలాంటి వెకిలి రాతలు రాసే వారికి కరోన వ్యాధి రావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వార్తలు రాయడం కరెక్ట్ కాదు ఇలాంటి వారిని వదిలిపెట్టేదిలేదు.తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్తాం. కేసీఆర్ చెప్తున్నాడంటే చాలా ఖతర్నాక్ ఉంటాయి. నేను జర్నలిస్ట్ లకు వ్యతిరేకం కాదు. ఈ సమయంలో జాతి ఐక్యత కోసం పని చేసే వారు గొప్పవారు. కొంతమంది మహిళ సర్పంచ్ లు రసాయనాలు పిచికారీ చేస్తున్నారు వారు గొప్పవారు.వారికి వందనం. నిజముద్దీన్ వారు ఇంకా ఉంటే వెంటనే రిపోర్ట్ చేయాలి.దయచేసి రిపోర్ట్ చేయండి. బాగా కష్టపడ్డవారికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తాం.

Next Story
Share it