Telugu Gateway
Telangana

డాక్టర్లపై దాడిచేసేది శాడిస్టులే..ఈటెల

డాక్టర్లపై దాడిచేసేది శాడిస్టులే..ఈటెల
X

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్లపై దాడుల చేస్తున్న వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని నారాయణ గూడ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో టీఎన్జీవో ల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధాని నాకు ఏ దేవుడు లేడు. వైద్యుడే దేవుడు అన్నారు. అలాంటి వైద్యులపై కొందరు మూర్ఖులు, శాడిస్టులు దాడి చేస్తున్నారు. వైద్యులపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డాక్టర్లు వారి ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. వాళ్ళ కుటుంబాన్ని పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్నారు.

డాక్టర్లపై పై పేషంట్లు దాడి చేసిన వారిని కూడా శిక్షించేలా ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేసాం. కరోనా వ్యాప్తి చెందిన వారిలో కొందరు తలసేమియా వంటి వ్యాధితో బాధ పడుతున్నారు...వారికి రక్తం అవసరం. రక్తం కొరత రాకుండా రక్తదానం చేసేందుకు చాలామంది ముందుకు రావాలిసిన అవసరం ఉంది. అందులో భాగంగానే టీఎన్జీవోలు రెండు వందల మందికి పైగా రక్తదానం చేశారు. టీఎన్జీవో లు ఎప్పుడు కూడా రక్త దానం చేయడానికి ముందు ఉంటారు.’ అని వ్యాఖ్యానించారు. ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో భర్తలను బయటకు పోనివ్వరు భార్యలు. కానీ డాక్టర్ లను సేవ చేయుమని వారి భార్యలు పంపుతున్నారు వారి గొప్ప మనసుకు అభినందనలు అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it