Telugu Gateway
Telangana

తెలంగాణలో 334కు చేరిన కరోనా కేసులు

తెలంగాణలో 334కు చేరిన కరోనా కేసులు
X

తెలంగాణలో కరోనా కేసులకు ఏ మాత్రం బ్రేక్ పడటం లేదు. ఆదివారం ఒక్క రోజే 62 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 334కు పెరిగింది. ఇప్పటివరకూ డిశ్చార్జి అయిన వారు 33 మంది అయితే..మృత్యువాత పడిన వారు 11 మందిగా ఉన్నారు. ఆస్పత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 290 మంది ఉన్నారు. రాష్ట్రంలో కరోనా పేషేంట్ల సంఖ్య పెరిగినా వైద్యం అందించేందుకు సర్కారు అన్ని ఏర్పాట్లు చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

ప్రస్తుతం పరీక్షలకు అవససరమైన టెస్ట్ కిట్స్, పీపీఈలు,మాస్కులు, ఇతర ముందులు అన్నీ అందుబాటులో ఉన్నాయని...ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈటెల ఓ ప్రకటనలో తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని సీఎం కెసీఆర్ ఆదేశించారన్నారు.సీఎంఆర్ఎఫ్ కు వస్తున్న విరాళాలను కూడా వైద్య సిబ్బందికి అవసరమైన మాస్కులు, పీపీఈలు, మందుల కొనుగోలుకు వాడాలని కోరారు.

Next Story
Share it