Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో 149కు చేరిన కరోనా కేసులు

ఏపీలో 149కు చేరిన కరోనా కేసులు
X

ఏపీపై ఢిల్లీ దెబ్బ బాగానే పడింది. చాలా రోజుల వరకూ అతి తక్కువ కేసులతో ఉన్న ఏపీలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గురువారం ఒక్క రోజే ఏపీలో 38 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 149కు చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చే'సింది. గురువారం నాడు కృష్ణా జిల్లాలో 8 కేసులు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయిందని చెప్పారు , రాష్ట్రంలో ఇప్పటివరకు జరిపిన కరోనా పరీక్షలో 143 మందికి పాజిటివ్‌గా తేలగా, 1321 మందికి నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 409 మంది ఫలితాలు రావాల్సి ఉంది. కృష్ణా జిల్లాలో ఇప్పుడు 23 పాజిటివ్ కేసులు ఉన్నాయి. నెల్లూరులో 24 కేసులు ఉండగా..గుంటూరులో ఈ సంఖ్య 20గా ఉంది.చిత్తూరులో తొమ్మిది కేసులు ఉన్నాయి.

Next Story
Share it