Telugu Gateway
Andhra Pradesh

కేంద్రం మా కంటే ఎక్కువ ధరకే కొన్నది

కేంద్రం మా కంటే ఎక్కువ ధరకే కొన్నది
X

కరోనా విషయంలో ఏపీ చాలా ముందుగా మేల్కొని నివారణ చర్యలు ప్రారంభించిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. ఆయన సోమవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఏ రాష్ట్రమైనా మా కంటే తక్కువ ధరకు కరోనా పరీక్షల కోసం కిట్లను కొనుగోలు చేసిందా? కేంద్రం మా కంటే ఎక్కువ ధరకు కిట్లను కొనుగోలు చేసింది. కావాలనే ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేస్తున్నారని’ అని నాని విమర్శించారు. ఏపీలో 32 వేల మంది కరోనా అనుమానితులకు లక్ష ర్యాపిడ్‌ కిట్స్‌ ద్వారా టెస్టింగ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు.

అత్యంత పారదర్శకంగా వైసీపీ ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు. కరోనా కట్టడికి సీఎం వైఎస్‌ జగన్‌ నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ అందిస్తోన్న మంచి పాలన చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. చంద్రబాబు చేసే కుటిల రాజకీయాల్లో భాగస్వామ్యం కావొద్దని కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి ఆళ్ల నాని సూచించారు. కిట్ల కొనుగోలులో అవినీతి జరిగిందని కన్నా లక్ష్మీనారాయణ నిరూపించగలరా? అని ఆయన ప్రశ్నించారు. విచిత్రం ఏమిటంటే కేంద్రం కొనుగోలు చేసిన దానికంటే తక్కువ ధరకు కొనుగోలు చేసినప్పుడు అదే మాటకు కట్టుబడి ఉండక...ఎందుకు నానా హంగామా చేస్తూ ...చత్తీస్ గడ్ రేటు మాత్రమే చెల్లిస్తామని ఇప్పుడు చెప్పటం వెనక మతలబు ఏమిటన్నదే కీలకంగా మారింది.

Next Story
Share it