Telugu Gateway
Andhra Pradesh

మంత్రి సురేష్ ను క్వారంటైన్ కు పంపుతారా?.

మంత్రి సురేష్ ను క్వారంటైన్ కు పంపుతారా?.
X

ఏపీ ప్రజలకు ఓ రూల్...మంత్రికి ఓ రూలా? అచ్చెన్నాయుడు

తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీకి వస్తే నిబంధనల ప్రకారం 14 రోజులు క్వారంటైన్ లో ఉంచుతారా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు ఓ రూల్..మంత్రికి ఓ రూలా? అని ఆయన ట్విట్టర్ వేదికగా ఏపీ సర్కారును ప్రశ్నించారు. ప్రజలకి వర్తించే రూల్స్ వైకాపా నాయకులకు వర్తించవా. హైదరాబాద్ నుండి పర్మిషన్ లెటర్ తీసుకోని వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను బోర్డర్ లో ఆపేసారు.

కనీస ఏర్పాట్లు చెయ్యకుండా గంటల తరబడి గర్భిణీ స్త్రీలను,విద్యార్థులను రోడ్ల పై కూర్చోబెట్టారు. క్వారంటైన్ కి వెళితే కానీ రాష్ట్రంలోకి అనుమతించం అని అన్నారు.ప్రజారోగ్యం దృష్ట్యా నిర్ణయాన్ని అందరూ అంగీకరించారు.ప్రతిపక్ష నేత రాష్ట్రానికి వచ్చినా క్వారంటైన్ కి వెళ్లి రావాల్సిందే అని వైకాపా మంత్రి మోపిదేవి సెలవిచ్చారు. మరి మంత్రి ఆదిమూలపు సురేష్ విషయంలో ఏమి చేస్తారో చెప్పాలన్నారు.

Next Story
Share it