Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో పన్నెండు గంటల్లోనే 34 కేసులు

ఏపీలో పన్నెండు గంటల్లోనే 34 కేసులు
X

ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శనివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకూ అంటే పన్నెండు గంటల్లో కొత్తగా 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 226కి పెరిగింది. కొత్తగా ఒంగోలులో రెండు, చిత్తూరులో ఏడు, కర్నూలులో 23, నెల్లూరులో 2 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఏపీలో నెల్లూరులోనే అత్యధికంగా 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Next Story
Share it