ఎస్ఈసీ లేఖపై డీజీపీకి వైసీపీ ఫిర్యాదు
BY Telugu Gateway19 March 2020 12:48 PM GMT
X
Telugu Gateway19 March 2020 12:48 PM GMT
ఏపీలో ఎస్ ఈసీ వివాదం అలా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసినట్లుగా చెబుతున్న లేఖపై వైసీపీ ఎమ్మెల్యేలు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల బృందం ఆయన్ను కలిసింది. రమేష్కుమార్ పేరుతో సర్క్యూలేట్ అయిన లేఖపై ఈ సందర్భంగా వారు డీజీపీ ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్, కైలే అనిల్ కుమార్, పార్థసారథి, మల్లాది విష్ణులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రలో భాగంగా ఈ లేఖను సర్క్యూలేట్ చేసినట్టుగా నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లేఖ ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో దర్యాప్తు చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల బృందం డీజీపీని కోరింది.
Next Story