Telugu Gateway
Telangana

కరీంనగర్ లో కొత్తగా రెండు కరోనా కేసులు

కరీంనగర్ లో కొత్తగా రెండు కరోనా కేసులు
X

కరీంనగర్ లో కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ శశాంక వెల్లడించారు. కరీంనగర్ లో స్థానికుడికి పాజిటివ్ వచ్చిన తరువాత ఆ కుటుంబం లోని ఇద్దరికి ఇప్పుడు పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా తమకున్న అనుమానంతో టెస్ట్ చేస్తే వారింట్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చిందన్నారు. మొత్తం ఏడుగురు వ్యక్తులు ఈ కుటుంబ లో ఉన్నారు. అందులో ముగ్గురు 5 ఏళ్ళల్లోపు పిల్లలు కూడా ఉన్నారు.

అందులో కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. అయినా...అందరిని గాంధీ కి తరలించారు. ఈ కుటుంబతో సన్నిహితంగా మెలిగిన వారు ట్రెస్ చేసేలోపే స్వచ్చందంగా ముందుకు రావాలని కోరారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారితో కలవటం వల్లే వీరికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేల్చారు. గతంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి సోదరి, తల్లికి ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు.

Next Story
Share it