Telugu Gateway
Andhra Pradesh

కరోనాపై పోరుకు పవన్ కళ్యాణ్ రెండు కోట్ల విరాళం

కరోనాపై పోరుకు పవన్ కళ్యాణ్  రెండు కోట్ల విరాళం
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనాపై పోరుకు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు, పీఎం సహాయ నిధికి కోటి రూపాయలు కలుపుకుని మొత్తం రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి 50 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గురువారం నాడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు . కరోనా మహమ్మారిని నిరోధించేందుకు ప్రధాని నరేంద్రమోడీ స్పూర్తిదాయక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.

అందుకే తన వంతు కోటి రూపాయల విరాళం పీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. ప్రభుత్వాలు చేపట్టిన చర్యలకు తోడు పలువురు ప్రముఖులు తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సినీ హీరో నితిన్ కూడా తెలంగాణ సీఎం సహాయ నిధికి పది లక్షల రూపాయలు, ఏపీ సీఎం సహాయ నిధికి పది లక్షల రూపాయలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story
Share it