Telugu Gateway
Andhra Pradesh

కేంద్ర ప్రభుత్వ భవనాల కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా?

కేంద్ర ప్రభుత్వ భవనాల కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా?
X

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ. రాష్ట్రంలోని పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయాటాన్ని హైకోర్టు తప్పుపట్టి...వెంటనే ఆ రంగులు తొలగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. రంగులు తొలగించిన తర్వాత తమకు నివేదిక అందజేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలపై ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. అదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది.

ఏపీ సర్కారు పిటీషన్ ను ప్రధాన న్యాయమూర్తి బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా అని ధర్మాసననం ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ సర్కారు వేసిన పిటిషన్‍ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో సర్కారు ఇక రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Next Story
Share it