Telugu Gateway
Telangana

తెలంగాణలో 15 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో 15 కొత్త కరోనా కేసులు
X

తెలంగాణలో ఒక్క మంగళవారం నాడే కొత్తగా 15 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97కు చేరింది. తాజాగా కరోనా పాజిటివ్ కేసులుగా తేలిన వారంతా ఢిల్లీలోని సమావేశానికి హాజరైన వారే అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. .ప్రస్తుతం 77 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు 13 మందిని డిశ్చార్జ్‌ చేశామని తెలిపిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి..కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందినట్లు తెలిపారు.

మర్కజ్‌ నుంచి వచ్చిన వారందరూ గాంధీ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవాలని ఈటెల కోరారు. కరోనా లక్షణాలు ఉన్నవారు.. వారి బంధువులను కూడా పరీక్షలకు తీసుకురావాలని మంత్రి ఈటల చెప్పారు. డయాలసిస్‌, తలసేమియా, సికెల్‌ సెల్‌ ఉన్నవారిని ప్రయాణానికి అనుమతించాలని సీఎం ఆదేశించారని ఈటల తెలిపారు. గర్భిణులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఈటల అన్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి ఈటల పేర్కొన్నారు.

Next Story
Share it