చంద్రబాబు పది లక్షలు...ఎమ్మెల్యేల నెల జీతం విరాళం
BY Telugu Gateway24 March 2020 1:59 PM GMT
X
Telugu Gateway24 March 2020 1:59 PM GMT
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నిరోధానికి, సహాయక చర్యల కోసం తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పది లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మొత్తం వ్యక్తిగతంగా కుటుంబపరంగా ఇవ్వనున్నారు. దీంతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని కూడా విరాళంగా అందజేయాలని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించనున్నారు.
టీడీఎల్పీ సభ్యులతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ తమవంతుగా ప్రభుత్వాలకు సహకరించాలని చంద్రబాబు కోరారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తన ఎంపీ లాడ్స్ నిధులతో పాటు ఒక నెల జీతం మొత్తాన్ని శ్రీకాకుళం జిల్లాలో చేపట్టే చర్యలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
Next Story