Telugu Gateway
Andhra Pradesh

అనుమతిచ్చి..ఎలా అడ్డుకుంటారు?

అనుమతిచ్చి..ఎలా అడ్డుకుంటారు?
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి ఉత్తరాంధ్ర పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా మారింది. పర్యటనకు అనుమతించి అడ్డుకోవటం ఏంటి అని చంద్రబాబు పోలీసు అధికారులను ప్రశ్నించారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నాం చంద్రబాబు కాన్వాయ్ బయటకు వెళ్ళకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులు కూడా నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ చట్టం ప్రకారం తనను వెనక్కి వెళ్ళాలని పోలీసులను ప్రశ్నించారు. ఆ వివరాలు ఏంటో చెప్పి తనకు నోటీసు ఇఛ్చి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు తాను ఎక్కడికైనా వచ్చి సహకరిస్తానని అన్నారు.

తొలుత రెండు గంటలు ఆగితే పంపిస్తామని చెప్పారని..ఇప్పుడు వెనక్కి వెళ్ళమని పోలీసులు చెప్పటం ఏంటని ప్రశ్నించారు. విశాఖపట్నంలో భూ కబ్జాలు జరిగాయని, అది నిజమో కాదో ప్రజలే తేలుస్తారన్నారు. పధ్నాలుగు సంవత్సరాలు సీఎంగా, 11 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న తననే ఇన్ని ఇబ్బందులు పెడితే ఇక ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలు తమపై కోడిగుడ్లు, వాటర్ ప్యాకెట్లు, కొంత మంది రాళ్ళు కూడా విసిరారని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు.

Next Story
Share it