Telugu Gateway
Andhra Pradesh

ఢిల్లీ పర్యటనకు పవన్ కళ్యాణ్

ఢిల్లీ పర్యటనకు పవన్ కళ్యాణ్
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు ఢిల్లీ పర్యటన తలపెట్టారు . ఆయన గురువారం ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శిస్తారు. అమరులైన సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రకటించిన కోటి రూపాయల చెక్కును ఈ సందర్భంగా సైనికాధికారులకు అందచేస్తారు. ఇటీవల మిలిటరీ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ అమర సైనిక వీరుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

దీంతోపాటు మధ్యాహ్నం మూడు గంటలకు విజ్ఞాన భవన్ లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొంటారు. దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ముఖ్య ఉపన్యాసాన్ని ఇస్తారని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది.

సీబీఐ అప్పగించటం మంచిదే

సుగాలీ ప్రీతి కేసును సీబీఐ అప్పగించటం మంచి పరిణామం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయం బాధితురాలి కుటుంబానికి ఊరట కలిగిస్తుందన్నారు. ఈ విషయంలో ఇఫ్పటికే ఆలశ్యం అయిందన్నారు. సీబీఐ విచారణ ద్వారా ఈ ప్రక్రియ వేగవంతం కావాలని పవన్ కోరారు. ప్రభుత్వంలో కదలిక వచ్చేలా సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచిన జనసేన నాయకులు, జనసైనికులకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.

Next Story
Share it