Telugu Gateway
Andhra Pradesh

దాడులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి

దాడులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
X

వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తెలుగుదేశం నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన నారా లోకేష్ పైన తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి రైతుల బాధకు చంద్రబాబు నాయుడే కారణం అని విమర్శించారు. తన సొంత ఆస్తుల ధరలు పెరగాలని చంద్రబాబు ఈ ప్రయత్నం చేస్తున్నారు. దాడులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మేం మాటలతోనే సమాధానం చెప్పాం. చేతల్లో చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఐదేళ్లు దోచుకుని, అదీ చాలక జోలె పట్టి జనాన్ని పట్టి పీడించుకు తినాలని బాబు ప్రయత్నం చేస్తున్నారు. అసైన్డ్ భూములు కోల్పోవడంతో, అక్రమంగా దోచుకున్న సంపద జారిపోతున్నాయి కాబట్టి ఈ కుట్ర పన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఇంత దూరం రానవసరం లేదు. రైతులే కాదు, రియల్టర్లు కూడా కలిసే ఢిల్లీ వచ్చారు’ అని అన్నారు.

తనపై జరిగిన దాడి వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్‌ హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై వెంటనే న్యాయ విచారణ చేసి వారిద్దరిని అరెస్ట్ చేయాలి ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే ఇంతకంటే దారుణాలకు పాల్పడతారని, భవిష్యత్తులో తనపై జరిగే దాడులు జరిగితే వారిద్దరే కారణమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటి వద్దకే పెన్షన్‌ కార్యక్రమాన్ని డైవర్ట్ చెయ్యడానికే టీడీపీ నేతలు ఇలాంటి దాడులకు దిగుతున్నారని విమర్శించారు. ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడితే.. లోకేష్ ఈ జన్మకు ఎమ్మెల్యే కాలేడని ఎద్దేవా చేశారు. నందిగం సురేష్‌ సోమవారం నాడు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

Next Story
Share it