జె సీ దివాకర్ రెడ్డికి జగన్ సర్కారు మరో షాక్
BY Telugu Gateway11 Feb 2020 4:20 AM GMT
X
Telugu Gateway11 Feb 2020 4:20 AM GMT
ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కొలువుదీరినప్పటి నుంచి మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డికి వరస పెట్టి షాక్ లే. ముందు అక్రమంగా వాహనాలు నడుపుతున్న ట్రావెల్స్పై చర్యలు..తర్వాత త్రిశూల్ సిమెంట్స్ మైనింగ్ లీజుల రద్దు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా మరో షాక్ ఇచ్చారు జె సీ దివాకర్ రెడ్డికి. తాజాగా ప్రభుత్వం ఆయన భద్రతను పూర్తిగా ఉపసంహరించుకుంది.
గతంలో గన్మెన్లను 2+2 నుంచి 1 + 1 కు తగ్గించిన ప్రభుత్వం తాజాగా భద్రతను పూర్తిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి జేసీ దివాకర్రెడ్డికి భద్రత తొలిగిస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Next Story