Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ..సాక్షిపై పరువు నష్టం దావా వేస్తాం

వైసీపీ..సాక్షిపై పరువు నష్టం దావా వేస్తాం
X

చంద్రబాబు మాజీ పీఎస్ పి. శ్రీనివాస్ నివాసంలో ఐటి దాడులకు సంబంధించి పంచనామా రిపోర్టు వెలుగులోకి వచ్చిన తర్వాత టీడీపీ దూకుడు పెంచింది. ఆ పార్టీ నేతలు వైసీపీని, సాక్షిని టార్గెట్ చేస్తూ విమర్శలు ప్రారంభించారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నలు వేస్తున్నారు. తమపై చేసిన దుష్ప్రచారానికి సంబంధించి ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తామని టీడీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. సాక్షి మీడియాపై పరువు నష్టం దావా వేస్తాం. ప్రెస్ కౌన్సిల్ కు, ఎడిటర్స్ గిల్ట్ కు ఫిర్యాదులు చేస్తాం. వైసిపి నేతలను, సాక్షి మీడియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని లేదని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబు మాపీ పిఎస్ పై దాడుల్లో రూ 2వేల కోట్లు రూపాయలు దొరికాయన్నట్లు వైసిపి నేతలు దుష్ప్రచారం చేశారని విమర్శించారు.

2లక్షల రూపాయల నగదుకు, రెండు వేల కోట్ల రూపాయలు అని ప్రచారం చేస్తారా..? అని యనమల ప్రశ్నించారు. పంచనామా కాగితాలు చూశాకైనా వైసిపి బుద్ది తెచ్చుకోవాలన్నారు. తప్పుడు ప్రచారం చేసినందుకు టిడిపికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దుష్ప్రచారం చేసిన వారిపై క్రిమినల్, లీగల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబును అరెస్ట్ చేయాలన్నవాళ్లు ఇప్పుడేం జవాబిస్తారు..? అరెస్ట్ చేయాలన్న నోళ్లు ఇప్పుడెందుకు మూతబడ్డాయి..? రోజుకు 20మంది చొప్పున లేచిన నోళ్లు ఇప్పుడెందుకు మూతబడ్డాయి.? ఐటి దాడులపై వైసిపి నేతల విమర్శలన్నీ అబద్దాలే అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it