Telugu Gateway
Andhra Pradesh

అప్పటివరకూ చంద్రబాబుకు నిరసనలే

అప్పటివరకూ చంద్రబాబుకు నిరసనలే
X

చంద్రబాబు తన నైజం మార్చుకోనంతకాలం ఆయనకు ఇలాంటి నిరసనలే ఎదురవుతాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. వ్యక్తిగత పర్యటనను చంద్రబాబు రాజకీయానికి వాడుకోవాలని చూశారని బొత్స ఆరోపించారు. విశాఖలో రెండు పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు చంద్రబాబు వచ్చారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చంద్రబాబు పోలీసులను అగౌరవపరిచేలా మాట్లాడారని అన్నారు. టీడీపీ గుండాలతో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న వైజాగ్‌లో చంద్రబాబు అరాచకం సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధికి ఆటంకం కలించాలన్నదే చంద్రబాబు దుర్బుద్ధి అని బొత్స విమర్శించారు.

విశాఖలో అభివృద్ధి వద్దని చెబితే.. ప్రజలు నిరసన తెలపకుండా స్వాగతిస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబులా తాము ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేయడం లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే విశాఖలో భూకబ్జాలు జరిగాయని అన్నారు. తన వర్గం, బినామీల కోసం బాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారని తెలిపారు. గత ఐదేళ్లు చంద్రబాబు అండ్‌ కో రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ఉత్తరాంధ్ర ప్రజలు సమయమనంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐటీ, ఫార్మా రంగాలన్నీ వైఎస్సార్‌ హయాంలోనే వచ్చాయని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదన్నారు.

Next Story
Share it