Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుది రోజుకో డ్రామా

చంద్రబాబుది రోజుకో డ్రామా
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి ప్రజా చైతన్య యాత్రపై అధికార వైసీపీ మండిపడింది. చంద్రబాబు రోజుకో డ్రామా ఆడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఆయన ప్రజాచైతన్య యాత్ర చేపట్టారని అంబటి ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు యాత్రను తాము అడ్డుకుంటున్నామన్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. ఏ పార్టీ అయినా...నేతలెవరైనా యాత్రలు చేసుకోవచ్చన్నారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే టీడీపీ తోకను కత్తిరించారని అన్నారు. . మార్టూరు సభలో 108 అంబులెన్స్‌ కు దారి ఇవ్వని సంస్కృతి చంద్రబాబుది అని విమర్శించారు. తన వ్యక్తిగత మాజీ కార్యదర్శి అక్రమాల ఆరోపణలపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

బాబు పీఎస్‌ను పట్టుకుంటేనే రూ. 2 వేల కోట్ల అక్రమాలు బయటపడ్డాయని అన్నారు. డబ్బులు ఖర్చుపెట్టి అధికారం చేజిక్కించుకోవాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారని, ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఎన్ని యాత్రలు చేసినా ఒరిగేది ఏమీ లేదని అన్నారు. మద్యం ధరలపై సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని అంబటి ధ్వజమెత్తారు. ‘అన్ని బ్రాండ్ లు దొరకడం లేదట. మద్యం ధర పెరిగిందట. ఏంటయ్యా నీ బాధ నువ్వు చెప్పాల్సింది మద్యం తాగవద్దని. మద్యం మాన్పించాలని మేము కొత్త పాలసీ మేము తెస్తే జనం తాగలేకపోతున్నారని ఆయన బాధ పడుతున్నారు.

Next Story
Share it