Telugu Gateway
Andhra Pradesh

ఐటి దాడులపై చంద్రబాబు నోరు మెదపరేం?

ఐటి దాడులపై చంద్రబాబు నోరు మెదపరేం?
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న చంద్రబాబు.. ఐటీశాఖ దర్యాప్తులపై ఎందుకు మాత్రం నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ శాఖ దర్యాప్తులపై ఎల్లో మీడియా కూడా స్పందించడం లేదన్నారు. తప్పు చేసింది ఎవరైనా అందుకు బాధ్యత వహించాల్సిందేనని అన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని బొత్స చెప్పారు. రాజధానిపై వ్యాపారస్తులతో కలిసి నారాయణ కమిటీ వేశారని విమర్శించారు. రూ. లక్షా 9వేల కోట్లతో ఒక ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఏం చేసినా రియాల్టీగా ఉంటుందన్నారు. ఐదేళ్లలో హైదరాబాద్‌కు ధీటుగా విశాఖను తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు వెల్లడించారు.

Next Story
Share it