అచ్చెన్నాయుడి ఛాలెంజ్
BY Telugu Gateway24 Feb 2020 4:26 AM GMT
X
Telugu Gateway24 Feb 2020 4:26 AM GMT
‘ఫైళ్ళు మీ దగ్గరే ఉన్నాయి. అధికారంలో ఉంది మీరే. తప్పు చేశానంటే చర్యలు తీసుకోండి. అంతే కానీ దుష్ప్రచారం చేస్తే మాత్రం మంచిది కాదు.’ అంటూ సర్కారును మాజీ మంత్రి , ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హెచ్చరించారు. తాను అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదన్నరు. అవసరం అయితే ప్రజల దగ్గర డబ్బులు అడిగి తీసుకుని రాజకీయం చేస్తానన్నారు. ఎర్రన్నాయుడు జయంతి సభలో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.ఈఎస్ఐ మందుల విషయమై కొందరు ఆరోపణలు చేస్తున్నారని, అందుకు సంబంధించిన ఫైల్స్ అన్నీ ప్రభుత్వం వద్దనే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం తనకు చేతనైంది చేసుకోవచ్చన్నారు.
Next Story