Telugu Gateway
Andhra Pradesh

టీడీపీకి షాక్...ఎమ్మెల్సీ డొక్కా రాజీనామా

టీడీపీకి  షాక్...ఎమ్మెల్సీ డొక్కా రాజీనామా
X

అత్యంత కీలకమైన రాజధానుల వికేంద్రీకరణ బిల్లు మండలి ముందుకు వచ్చిన తరుణంలో ప్రతిపక్ష టీడీపీకి షాక్. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. అదే సమయంలో రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి కూడా పంపారు. తాను భవిష్యత్ లో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయనని డొక్కా మాణిక్యవరప్రసాద్ చెబుతున్నారు.

రాజధాని అమరావతి నుంచి వెళ్లిపోతున్నందునే తాను రాజీనామా చేసినట్లు డొక్కా తెలిపారు. తనను ఇన్నేళ్ళు ప్రోత్సహించిన చంద్రబాబుకు ధన్యవాదాలు అని డొక్కా తన లేఖలో పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రకటించారు. . ఓ వైపు డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా..పార్టీ విప్ జారీ చేసినా కొంత మంది ఎమ్మెల్సీలు సభకు డుమ్మా కొట్టారు.

Next Story
Share it