Telugu Gateway
Cinema

‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ అదిరింది

‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ అదిరింది
X

మహేష్ బాబు, రష్మిక మందన నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ ఆదివారం రాత్రి విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ చూస్తే సినిమాలో కామెడీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధం అవుతుంది. దర్శకుడు అనిల్ రావిపూడి మొదటి నుంచి చెబుతున్నట్లు ‘ట్రైన్ ఎపిసోడ్’లో కామెడీ అదిరిపోయింది. హీరోయిన్ రష్మిక డైలాగ్ లు అయితే పిచ్చ కామెడీగా ఉన్నాయి. ‘నీకు అర్ధమవుతుందా’ అంటూ రష్మికతో చెప్పించిన డైలాగ్ ఈ ట్రైలర్ లో హైలెట్ గా నిలుస్తుంది. దీంతో పాటు ప్రతి సన్నివేశం కూడా ఆకట్టుకునేలా ఉంది.

హీరో మహేష్ బాబు డైలాగ్ ‘చిన్న బ్రేక్ ఇస్తున్నా..తర్వాత బొమ్మ దద్దరిల్లిపోతుంది’ అంటూ ట్రైలర్ ను ముగిస్తారు. ఈ సినిమా ట్రైలర్ తో సరిలేరు నీకెవ్వరు పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు. ఆదివారం నాడు హైదరాబాద్ లో ని లాల్ బహదూర్ స్టేడియం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

https://www.youtube.com/watch?time_continue=3&v=Pim3CUGCXbY&feature=emb_logo

Next Story
Share it