Telugu Gateway
Cinema

రష్మిక ఇంటిపై ఐటి దాడులు

రష్మిక ఇంటిపై ఐటి దాడులు
X

రష్మిక మందన. టాలీవుడ్ లో ఇఫ్పుడు టాప్ హీరోయిన్. వరస పెట్టి అగ్రహీరోలతో సినిమాలు చేసుకుంటూ దూసుకెళుతోంది. ఆమె చేసిన ప్రతి సినిమా విజయవంతం అవుతూనే ఉంది. కొన్ని సినిమాలు ఓ మోస్తరుగా ఉన్నాయనే టాక్ వచ్చినా రష్మిక మందనా నటనకు మాత్రం మంచి మార్కులు పడుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్ పేటలోని రష్మిక ఇంట్లో ఐటి అధికారులు దాడులు చేస్తున్నారు. అయితే ఈ దాడుల్లో ఐటి అధికారులు ఏమి గుర్తించారనే అంశం మాత్రం వెలుగుచూడాల్సి ఉంది.

తాజాగా ఆమె హీరో మహేష్ బాబు తో కలసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సినిమాలో ‘మీకర్ధంమవుతోందా’ అంటూ రష్మిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతోపాటు ఓ వైపు నితిన్ తో కలసి భీష్మ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు కూడా ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం.

Next Story
Share it