Telugu Gateway
Politics

ఎన్ కౌంటర్ బాధాకరం..టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఎన్ కౌంటర్ బాధాకరం..టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ రేప్ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దిశ అనే అమ్మాయికి అన్యాయం జరిగింది బాధ పడ్డాం. ఆ తర్వాత నలుగురు పిల్లలను కూడా చంపేశారు. దీనికి కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే ఆ నలుగురు పిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించండి’ అని వ్యాఖ్యానించారు. తప్పులు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. నిమిషాల్లో సమాచారం వెళ్లిపోతుంది.

వెంటనే పోలీసులు వచ్చి ఆదుకునేది ఉంది. రావటానికి ఐదు నిమిషాలు టైం పట్టొచ్చు. మూడు నిమిషాలు పట్టొచ్చు. ఆ మూడు, ఐదు నిమిషాల టైమ్ లో జరగరాని నష్టం జరిగితే జరగొచ్చు. దాని వల్ల ప్రజల్లో కూడా అపవాదు రావొచ్చు అని వ్యాఖ్యానించారు. ఆలేరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొంగిడి సునీత ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వైపు ఎన్ కౌంటర్ పై ప్రజల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుండగా..అధికార పార్టీ ఎమ్మెల్యే అందుకు భిన్నంగా వ్యాఖ్యానించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it