Telugu Gateway
Latest News

ఆ ఇంటి ఓనర్ కు దొంగ రాసిన లేఖ ఏంటో తెలుసా?!

ఆ ఇంటి ఓనర్ కు దొంగ రాసిన లేఖ ఏంటో తెలుసా?!
X

అ..ఆ సినిమాలో దొంగ పాత్ర వేసిన షకలక శంకర్ చాలా కష్టపడి పైకి వచ్చా..ఏదైనా ఇవ్వమంటాడు. దొంగతనం చేయటానికి వచ్చిన అతన్ని హీరో నితిన్ పట్టుకుంటాడు కాబట్టి కష్టానికి తగ్గ ప్రతిఫలం అడుగుతాడు. అచ్చం అలాంటిదే ఈ ఘటన కూడా. కాకపోతే ఈ దొంగకు సాయం చేయటానికి ఆ ఇంట్లో ఎవరూ లేరు. ఓ దొంగ రాత్రంతా కష్టపడి ఇంటి ఉన్న కిటికీ తొలగించాడు. ఇంట్లోకి ప్రవేశించాడు. ఇళ్ళంతా వెదికాడు. కానీ ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. అటు డబ్బు కానీ..ఇటు బంగారం కానీ ఏమీ దొరకలేదు. దీంతో విస్తుపోవటం దొంగ వంతు అయింది.

మామూలుగా అయితే ఏ దొంగ అయినా ఏమి చేస్తాడు..నీరసంగా అక్కడి నుంచి ఖాళీ చేతులతో బయట పడతాడు. కానీ ఈ దొంగ అలా చేయలేదు. ఓ కాయితంపై చిన్నపాటి లేఖ రాసి పెట్టిపోయాడు. అదేంటి అంటే...‘నవ్వు చాలా పిసినారివి. కనీసం కిటికీ ఊడగొట్టేందుకు పడిన కష్టానికి కూడా ప్రతిఫలం దక్కలేదు. ఓ రాత్రి అంతా వేస్ట్ అయింది’ అంటూ రాసి పెట్టి వెళ్ళిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఇలా దొంగలు కూడా తమ కష్టానికి ప్రతిఫలం కోరుతున్నారన్న మాట. నిజంగా అక్కడ ఏమైనా డబ్బులు..బంగారం దొరికి ఉంటే..ఈ దొంగ ఏమైనా థ్యాంక్స్ చెప్పేవాడా?.

Next Story
Share it