Telugu Gateway
Politics

జాతీయ జనగణనకు 8500 కోట్లు

జాతీయ జనగణనకు 8500 కోట్లు
X

జాతీయ పౌర జాబితా (ఎన్ సీఆర్) పై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. తాజాగా కేంద్రం ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లే కన్పిస్తోంది. అయితే ఇప్పుడు కొత్తగా ఎన్ పీఆర్ ముందుకొచ్చింది. అదే జాతీయ జనాభా పట్టిక. దేశ వ్యాప్తంగా జనగణన కోసం కేంద్ర కేబినెట్ 8500 కోట్ల రూపాయలు కేటాయిస్తూ మంగళవారం నాడు నిర్ణయం తీసుకుంది. ఇది ఓ యాప్ ద్వారా చేపట్టనున్నారు. అయితే జాతీయ జనగణన సందర్భంగా ప్రజలు ఎవరూ ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం ఉండదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవకర్ తెలిపారు. కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయాలను ప్రకాష్ జవదేకర్ మీడియాకు వివరించారు. జనాభా నమోదు కార్యక్రమాన్ని చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలూ అంగీకరించాయని తెలిపారు. 2010లోనే దీన్ని తొలిసారి ప్రవేశపెట్టారని, అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తొలి కార్డును జారీ చేశారని తెలిపారు. భారతదేశంలో జీవించే ప్రజలందరి జాబితాను రూపొందించేందుకే దీనిని నిర్వహిస్తున్నామన్నారు. 2021 ఫిబ్రవరి నుంచి 16వ జనాభా గణన వుంటుంది. ఇందుకోసం స్పెషల్‌ మొబైల్‌ ఆప్‌ తీసుకొస్తాం. ప్రజలు ఈ యాప్‌ ద్వారా స్వయంగా వివరాలను నమోదు చేయవచ్చు.

స్వయం ప్రకటిత వివరాల ఆధారంగా గణన వుంటుంది. అంతేకానీ, దీనికి ఎలాంటి ధృవీకరణ పత్రాలు, బయో మెట్రిక్‌ వివరాల నమోదు వుండదు. ప్రధానంగా సంక్షేమ పథకాల అసలైన లబ్దదారులు వెలుగులోకి వస్తారు. తద్వారా లబ్దిదారులకు మేలు కలగనుంది. టూరిజం విభాగం అభివృద్ధిపై మరింత దృష్టిపెట్టినట్టు కేంద్రమంత్రి వివరించారు. హిమాలయా, నార్త్‌ ఈస్ట్‌, కృష్ట, కోస్టల్‌, ఇకో, డిజర్ట్‌, తీర్థాంకర్‌, రామాయణ తదితర 16 సర్క్యూట్స్‌ ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఒక వ్యక్తి రెండు ఆయుధాలకు లైసెన్స్‌ కలిగి వుండేందుకు అనుమతి. గతంలో మూడువుండగా, తర్వాత ఒక ఆయుధానికి పరిమితం చేసినా, తాజా నిర్ణయంలో రెండు ఆయుధాలకు అనుమతి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా నియమించబడే అధికారి ఫోర్ స్టార్ జనరల్ , సైనిక వ్యవహారాల విభాగానికి అధిపతిగా ఉంటారు. రైల్వే బోర్డు పునర్నిర్మాణం చారిత్రాత్మక నిర్ణయం. ఈప్రక్రియ కొనసాగుతోంది- మంత్రి పియూష్ గోయల్. మొత్తం 8 రైల్వే సేవలను ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ (ఐఆర్‌ఎంఎస్‌) కిందికి తీసుకురానుంది. దీనికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Next Story
Share it