Telugu Gateway
Telangana

యువ డాక్టర్ దారుణ హత్య

యువ డాక్టర్ దారుణ హత్య
X

స్కూటీ పంచర్ ఆమె ప్రాణం తీసింది. ఒక్కతే ఉండటంతో కొంత మంది లారీ డ్రైవర్లు ఆ యువ డాక్టర్ ప్రాణం తీశారు. అది కూడా అత్యంత దారుణంగా. అయితే వాళ్ళు అత్యాచారం చేసి హత్య చేశారా?. లేక గొడవ కారణంగా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ హత్యకు సంబంధించి వెలుగులోకి వచ్చిన అంశాలు షాక్ కు గురిచేసేలా ఉన్నాయి. కొందరు దుండగులు ఓ యువతిని సజీవ దహనం చేశారు. షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్దు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో యువతి మృతదేహం కన్పించటం కలకలం రేపింది. మృతురాలు ప్రియాంకారెడ్డి అని, ఆమె వెటర్నరీ వైద్యురాలని పోలీసులు గుర్తించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట్ మండలం కొల్లూర్ గ్రామంలో ఆమె వెటర్నరీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నర్సయిపల్లి గ్రామం ఆమె స్వస్థలం. అయితే వీళ్ళు ప్రస్తుతం శంషాబాద్‌లో నివసిస్తున్నట్టు చెబుతున్నారు.

రోజూ స్కూటీ మీద ప్రియాంకారెడ్డి విధులకు వెళ్లేది. బుధవారం కూడా విధులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆమె స్కూటీ పాడైంది. దీంతో భయపడుతూ ప్రియాంక తనకు ఫోన్‌ చేసిందని, అక్కడి స్థానికులు స్కూటీని రిపేర్‌ చేయిస్తామని తీసుకెళ్లి.. దుకాణాలు మూసిఉన్నాయని మళ్లీ తీసుకొచ్చారని తనకు చెప్పిందని, అక్కడ లారీ డ్రైవర్లు తిరుగుతూ ఉండటంతో భయంగా ఉందని చెప్పిందని ప్రియాంక సోదరి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అక్కడ ఉండవద్దని సమీపంలోని టోల్‌గేట్‌ వద్దకు వెళ్లమని తాను చెప్పినా.. వెళ్లలేదని, ఈ నేపథ్యంలో తన చెల్లెలు తిరిగిరాకపోవడం, ఇంతలోనే ఆమె మరణవార్త వినాల్సి వచ్చిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

Next Story
Share it