Telugu Gateway
Telangana

హైదరాబాద్ లో రెండు ఆర్టీసి బస్సులు ఢీ

హైదరాబాద్ లో రెండు ఆర్టీసి బస్సులు ఢీ
X

తాత్కాలిక ఆర్టీసి డ్రైవర్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. బస్సులో ఉన్న వారికే కాకుండా..వీరి డ్రైవింగ్ రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులు కూడా గజగజ వణికిపోవాల్సి వస్తోంది. కొంత మంది డ్రైవర్లు మద్యం సేవించి మరీ విధుల్లోకి వస్తుండటంతో పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. సోమవారం హైదరాబాద్ లోని కూకల్ పల్లి సమీపంలో అదే జరిగింది. నగరంలోని కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. కాకపోతే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.

కూకట్‌పల్లి వై జంక్షన్‌ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు మరో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో రెండు బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డ్రైవర్‌ అనుభవ రాహిత్యమై ఈ ప్రమాదానికి కారణమని మండిపడ్డ ప్రయాణికులు.. డ్రైవర్‌ను చితక్కొట్టారు. రెండు బస్సులు నడిరోడ్డుపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మద్యం మత్తులో బస్ ను నడిపారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Next Story
Share it