‘ప్రతి రోజు పండగే’ విడుదల డిసెంబర్ 20న
BY Telugu Gateway16 Oct 2019 3:53 PM GMT
X
Telugu Gateway16 Oct 2019 3:53 PM GMT
సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన సినిమానే ‘ప్రతి రోజు పండగే’ మూవీ. చాలా గ్యాప్ తర్వాత ఈ యువ హీరోకు ‘చిత్రలహరి’ సినిమా బ్రేక్ ఇచ్చింది. దీంతో కొత్త సినిమాపై కూడా ఈ హీరో భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పలు హిట్ చిత్రాలను తెరకెక్కించిన మారుతి దర్శకత్వంలోఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
సుప్రీమ్ తర్వాత రాశీఖన్నా ఈ సినిమాతో మరోసారి సాయి తేజ్ సరసన నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. చిత్రానికి సంబంధించిన తదుపరి షెడ్యూల్ని అమెరికాలో షూట్ చేయనున్నారు.
Next Story