వాళ్ళే వెళ్లారు...వాళ్ళే చేరాలి
BY Telugu Gateway24 Oct 2019 1:00 PM GMT
X
Telugu Gateway24 Oct 2019 1:00 PM GMT
ఆర్టీసి కార్మికుల సెల్ఫ్ డిస్మిస్ నుంచి సీఎం కెసీఆర్ రూటు మార్చారు. విధుల నుంచి వాళ్ళే వెళ్ళిపోయారు. ఉద్యోగాలు కావాలనుకుంటే వచ్చి దరఖాస్తు చేసుకుని వాళ్ళే చేరాలి అని వ్యాఖ్యానించారు. యూనియన్ నాయకుల మాయ మాటలు వినే వెళ్ళే ముందు ఆలోచించుకోవాలి కదా?. కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటామంటే ఎవరు మాత్రం ఏమి చేస్తారు?.
ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లతో నాకేమి పంచాయతీ ఉంటది. యూనియన్లతో సంబంధం లేకుండా ఎవరైనా వచ్చి దరఖాస్తు చేసుకుంటే చేరొచ్చు అంటూ వ్యాఖ్యానించారు. ఉద్యోగులు కూడా ఓ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలన్నారు. ఇప్పుడు ఎవరు ఇబ్బందులు పడుతున్నారు అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు, అధికారులు మంచోళ్ళే అని..యూనియన్లతోనే సమస్య వస్తుందని అన్నారు.
Next Story