Telugu Gateway
Politics

కెసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

కెసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ
X

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గురువారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు లేఖాస్త్రం సంధించారు. ఇందులో ఆయన ముఖ్యంగా యువతకు సంబంధించిన అంశాలనే లేవనెత్తారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని ప్రచారం చేసి..అధికారంలోకి వచ్చాక యువతను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. కెసీఆర్ తన ఐదున్నర సంవత్సరాల పాలనలో యువతకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలోని యువతకు మేలు చేసేలా తెలంగాణ రాష్ట్ర యువజన కమిషన్ ను ఏర్పాటు చేయాలని కోరారు.

యువతలోని నైపుణ్యాలను మెరుగుపర్చి వారికి సరైన దిశానిర్దేశం చేస్తే తమ లక్ష్యాలను చేరుకోలగదన్నారు. ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లే యువత నష్టపోయిందన్నారు. సర్కారు మోసపూరిత విధానాలను యువత ఎప్పుడైనా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలు పంపిస్తున్నారని అన్నారు. ఇంత కాలం నిర్లక్ష్యం చేసిన యువత అంశం ఇఫ్పటికైనా సర్కారు ఫోకస్ పెట్టాలని రేవంత్ తన లేఖలో కెసీఆర్ ను కోరారు.

Next Story
Share it