Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం
X

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం రెడీ అయిపోయింది. శనివారం నాడు ఈ కార్యలయం ప్రారంభోత్సవం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యాలయం ప్రారంభోత్సవం సాగింది. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ చేత రిబ్బన్‌ కట్‌ చేయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు.

కార్యాలయంలోని తన ఛాంబర్‌లోకి విచ్చేసిన ముఖ్యమంత్రికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరు అయ్యారు. అంతకు ముందు ముఖ్యమంత్రి సీఎం జగన్‌ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు.

Next Story
Share it