Telugu Gateway
Politics

కాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం

కాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం
X

కేంద్రం అత్యంత పకడ్బందీగా ముందుకెళుతోంది. జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోవటంతో పాటు వాటి అమలు విషయంలో కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టే బిల్లును సత్వరమే ఆమోదింపచేసుకుంది. రాజ్యసభలో ఈ బిల్లు అత్యంత సునాయసంగా గట్టెక్కెంది. అదేవిధంగా ఆర్టికల్‌ 370ను రద్దు చేసే తీర్మానాన్ని కూడా రాజ్యసభ ఆమోదించింది. జమ్మూకాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై పెద్దల సభలో డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌ చేపట్టగా.. అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్డీయే ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీతో రాజ్యసభలో ఈ కీలక బిల్లును ఆమోదించుకుంది.

బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించే బీఎస్పీ, ఆప్ తో పాటు వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ, బోడోల్యాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ తదితర విపక్ష పార్టీలు కూడా ఈ బిల్లుకు మద్దతు పలికాయి. ఈ విషయంలో బీజేపీ మిత్రపక్షం జేడీయూ కేంద్రానికి షాక్‌ ఇవ్వడం విశేషం. ఒక్క జేడీయూ మినహా ఎన్డీయే కూటమిలోని పార్టీలన్నీ బిల్లు విషయంలో కేంద్రానికి అండగా నిలిచాయి. ఈ బిల్లును కాంగ్రెస్‌, ఎస్పీ, జేడీయూ, డీఎండీకే, డీఎంకే, సీపీఎం, పీడీపీ, ఎన్సీపీ, ఎన్సీ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. ఇందులో ఎన్డీయే భాగస్వామి జేడీయూ, కాంగ్రెస్‌ మిత్రపక్షం ఎన్సీపీ బిల్లుపై ఓటింగ్‌కు దూరంగా ఉంటామని విస్పష్టంగా ప్రకటించాయి.

Next Story
Share it