‘సాహో’ ఫస్ట్ సాంగ్ వస్తోంది
సాహో సందడి మొదలైంది. విడుదల ముహుర్తం దగ్గరకు వస్తుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరు పెంచింది. అందులో భాగంగానే తొలి పాటకు సంబంధించిన టీజర్ ను శుక్రవారం నాడు విడుదల చేసింది. సైకో సయ్యా అంటూ సాగే ఈ పాటలో ప్రభాస్, శ్రద్ధ లుక్స్ కు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ పూర్తి పాటను జూలై 8న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకుడు.
యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోంది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్గా నటిసస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్లకు చెందిన ప్రముఖ నటులు నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు 15న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన తొలి సినిమా సాహోనే కావటంతో దీనిపై భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి.
https://www.youtube.com/watch?time_continue=1&v=1jDRlTZB1Lc