Telugu Gateway
Andhra Pradesh

ఆ ఎంపీలకు కేశినేని నాని ‘పంచ్’

ఆ ఎంపీలకు  కేశినేని నాని ‘పంచ్’
X

పాత స్నేహితులకు టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇఛ్చిన పంచ్ పేలింది. మరోసారి కేంద్ర బడ్జెట్ లో విభజన వల్ల నష్టపోయిన ఏపీకి అన్యాయమే ఎదురైంది. దీంతో నాని పార్టీ ఫిరాయించిన ఎంపీలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్తున్నామని బిల్డప్‌ ఇచ్చారు. నిన్నటి బడ్జెట్‌ చూశాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైంది.

ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్లారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి చేరారో’ అంటూ ట్వీట్‌ చేశారు. విమర్శనాత్మక ధోరణిలో కేశినేని నాని చేసిన ఈ ట్వీట్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. 2019–20 బడ్జెట్‌ను ఉద్దేశిస్తూ.. జంపింగ్‌ ఎంపీలు సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లకు ట్విటర్‌ వేదికగా చురకలంటించారు.

Next Story
Share it