Telugu Gateway
Telangana

హైదరాబాద్ లో 150 కిలోల బంగారం సీజ్

హైదరాబాద్ లో 150 కిలోల బంగారం సీజ్
X

కలకలం. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 150 కిలోల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. ఈ వ్యవహారం హైదరాబాద్ లో పెద్ద సంచలనంగా మారింది. విమానాశ్రయంలో ప్రయాణికుల నుంచి భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకోవటం మామూలే అయినా ఈ సారి కార్గొలో ఇంత భారీ మొత్తం బంగారాన్ని గుర్తించటం విశేషం. మలేషియా నుంచి హైదరాబాద్ కు ఈ మొత్తాన్ని తరలించినట్లు కస్టమ్స్ అధికారులు తేల్చారు. ముందస్తుగా అందిన సమాచారం ప్రకారం తనిఖీలు చేపట్టగా ఈ బంగారం దొరికింది. కొన్ని సంస్థలు అక్రమంగా ఈ బంగారం లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.

హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ ఈ బంగారం తీసుకురావటంలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. అయితే దీనికి అనుమతులు ఉన్నాయా?. లేవా అనే అంశంపై పరిశీలన సాగుతోంది. ఈ బంగారం వెనక ఎవరు ఉన్నారు?. ఎవరి కోసం ఇది తెచ్చారు?. ఎక్కడికి తరలిస్తున్నారు? అనే అంశాలపై పరిశోధన సాగుతోంది. ఈ వ్యవహారం వెనక పలు రాష్ట్రాలకు చెందిన బడాబాబులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విచారణలోనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.

Next Story
Share it