కొత్త సినిమాకు ‘శ్రీకారం’ చుట్టిన శర్వా
BY Telugu Gateway30 Jun 2019 6:51 AM GMT
X
Telugu Gateway30 Jun 2019 6:51 AM GMT
శర్వానంద్ చేతి గాయం నుంచి కోలుకుని కొత్త సినిమా కు ‘శ్రీకారం’ చుట్టారు. కొద్ది రోజుల క్రితం ఓ షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన శర్వానంద్ శస్త్ర చికిత్స తర్వాత కొంత కాలం విశ్రాంతి తీసుకున్నారు. 29వ సినిమా శ్రీకారం పూజా కార్యక్రమం హైదరాబాద్ లో ఆదివారం నాడు జరిగింది. ఇది శర్వానంద్ 29వ సినిమా. ఈ సినిమాకు సుకుమార్ క్లాప్ కొట్టారు.
ఆగస్టు నుంచి ఈ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 2020 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను రామ్ ఆచంట,, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించనున్నారు. శర్వానంద్ నటించిన ‘రణరంగం’ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.
Next Story