Telugu Gateway
Telangana

ఆ ‘మసాజ్’తో సర్వరోగాలు మాయం!

ఆ ‘మసాజ్’తో సర్వరోగాలు మాయం!
X

మసాజ్. బాడీ రిలాక్సేషన్ కు చాలా మంది ఈ మార్గాన్ని ఆశ్రయిస్తారు. భారతీయ వైద్యంలో ఈ మసాజ్ కు ఓ ప్రత్యేక స్థానం ఉందనే చెప్పొచ్చు. దేశంలోని కేరళ మసాజ్ వైద్యానికి అయితే ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎన్నో మొండి వ్యాధులను సైతం మసాజ్ మాయం చేస్తుంది. కానీ ‘ఒక్క మసాజ్’తో సర్వ రోగాలు మాయం అంటే ..ఇక ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ మసాజ్ సెంటర్ కూడా పట్టనంత జనం అక్కడకు చేరుకుంటారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటారు. అంతే కాదు...చాలా విషయాలపై ఆయన తన వైఖరిని కుంబబద్దలు కొట్టినట్లు స్పష్టం చేస్తారు కూడా. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది. ఒక రోడ్ రోలర్ చక్రంపై అంటించిన బాడీ మసాజ్ ప్రకటన పోస్టర్ నిత్యం బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా కంట పడింది.

ఈ ప్రకటనకు సంబంధించిన పోస్టర్‌ ఒక రోడ్ రోలర్ చక్రం మీద అంటించడమే ఆసక్తికరంగా మారింది. అంతేకాదు బాడీ మసాజ్ కేవలం రూ.499 మాత్రమే అని దానిపై రాసి ఉంది. ఇక ఆయన ఊరుకుంటారా? వెంటనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దానికి చక్కటి కామెంట్‌ జత చేశారు. దీంతో ఇది వైరల్‌ అయింది. ఇలాంటి మసాజ్‌ ఒకసారి చేసుకుంటే చాలు...ఇక జీవితంలో మరోసారి దీని అవసరం రాదు. ఈ మసాజ్‌తో శరీరంలోని రుగ్మతలన్నీ మటుమాయమంటూ పేర్కొన్నారు. అంతేకాదు ఈ పోస్టర్ అంటించిన వ్యక్తికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ అయినా ఉండాలి లేదంటే ఐక్యూ లెవల్ అయినా తక్కువగా ఉండాలని ట్వీట్ చేశారు.

Next Story
Share it