హీరో రామ్ కు పోలీసుల ఝలక్
BY Telugu Gateway24 Jun 2019 3:53 PM GMT
X
Telugu Gateway24 Jun 2019 3:53 PM GMT
హీరో రామ్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. చార్మినార్ ప్రాంతంలో షూటింగ్ లో పాల్గొన్న ఈ హీరో బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగారు. దీంతో ఆయనకు చార్మినార్ ఎస్ఐ పండరీ 200 రూపాయల జరిమానా విధించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం చార్మినార్ ప్రాంతంలో నడుస్తోంది.
నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాలు..ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సిగరెట్ తాగటంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే చాలా చోట్ల ఇది అమలు కావటం లేదు. సెలబ్రిటీ అయినా సరే పోలీసులు తమ విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించి శభాష్ అన్పించుకున్నారు.
Next Story