నాగార్జునతో కీర్తిసురేష్ రొమాన్స్
BY Telugu Gateway4 Jun 2019 2:45 PM GMT
X
Telugu Gateway4 Jun 2019 2:45 PM GMT
అక్కినేని నాగార్జున మరోసారి ‘మన్మథుడు’గా మారిన విషయం తెలిసిందే. ఇటీవల వరకూ పోర్చుగల్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలసి సందడి చేసిన నాగార్జున..ఇప్పుడు కీర్తి సురేష్ తో రొమాన్స్ కు రెడీ అయిపోయారు. కీర్తి మన్మథుడు 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు ప్రస్తుతం. యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ‘మన్మథుడు-2’ చిత్రాన్ని నాగార్జునతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం నాగార్జున, కీర్తి సురేష్ ల రొమాంటిక్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ లోకేషన్లోని ఓ పిక్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సమంత కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Next Story