Telugu Gateway
Andhra Pradesh

టీడీపీలో ఆగని కేశినేని నాని రగడ..మరో కొత్త కామెంట్

టీడీపీలో ఆగని కేశినేని నాని రగడ..మరో కొత్త కామెంట్
X

విజయవాడ ఎంపీ కేశినేని తన ధిక్కార ధోరణిని కొనసాగిస్తూనే ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో సమావేశం అయిన తర్వాత కూడా ఆయన వైఖరిలో పెద్దగా మార్పు ఉన్నట్లేమీ కన్పించటం లేదు. ఎందుకంటే ట్విట్టర్ వేదికగా ఆయన పెట్టిన పోస్ట్ మరో సారి టీడీపీలో కలకలం రేపుతోంది. బుధవారం నాడు లోక్ సభలో విప్ వంటి ‘పెద్ద పోస్టు’కు తాను అర్హుడిని కానంటూ..అర్హులైన..సమర్ధులైన వాళ్ళను నియమించమని వ్యాఖ్యనించి కలకలం రేపారు. అదే నాని..గురువారం నాడు ట్విట్టర్ వేదికగా ‘పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్ళు తప్ప’ అంటూ మరో పోస్ట్ పెట్టారు.

దీంతో నాని ఉద్దేశం ఏమిటా? అన్న సందేహం కలుగుతోంది పార్టీ నేతల్లో. ఆయన టీడీపీ నుంచి బయటకు వెళ్లటానికి నిర్ణయించుకునే ఇలా సోషల్ మీడియాలో పార్టీపై ఎటాక్ ప్రారంభించారా అన్న అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీ ఇప్పటికిప్పుడు కేశినేని నానిపై చర్యలకు ఉపేక్షించే ఛాన్స్ కూడా కన్పించటం లేదు. మరి నాని రోజూ ఇలా కొత్త కొత్త అంశాలను సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ వెళితే పార్టీకి మరింత నష్టం జరిగే ప్రమాదం కూడా లేకపోలేదని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it