వైసీపీ గెలిచే ఎంపీ సీట్లు ఇవే. ఆరు సీట్లలోనే పోటాపోటీ
అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఇండియా టుడే ఆసక్తికర ఫలితాలను వెల్లడించింది. వైసీపీ ఏయే లోక్ సభ సీట్లలో విజయం సాధించనుందో స్పష్టంగా పేర్కొంది. రాష్ట్రాల వారీగా ఏ సీటు ఎవరికి దక్కుతుందో అంచనా వేసింది ఎగ్జిట్ పోల్స్ అనంతరం ఈ వివరాలను తన వెబ్ సైట్ లో ఉంచింది. దీని ప్రకారం ఏపీలో వైసీపీ ఏకంగా 18 ఎంపీ సీట్లను దక్కించుకోనుంది. కేవలం ఆరు సీట్లలో మాత్రం పోటీపోటీ ఉంది. వైసీపీగెలిచే వాటిలో తిరుపతి, నెల్లూరు, కడప, రాజంపేట, హిందూపూర్, నరసరావుపేట, నర్సాపురం, ఒంగోలు, బాపట్ల, ఏలూరు, అమలాపురం, కాకినాడ, అనకాపల్లి, కర్నూలు, అరకు, విజయనగరం సీట్లు ఉన్నాయి.
ఒక్క విశాఖపట్నం ఎంపీ సీటును మాత్రం ఇండియా టుడే జనసేన ఖాతాలో వేసింది. ఇక్కడ నుంచి సీబీఐ మాజీ జెడీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే శ్రీకాకుళం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అనంతపురం, చిత్తూరు లోక్ సభ సీట్లలో మాత్రం పోటీపోటీ ఉందని ఇండియా టుడే తెలిపింది. మరో రెండు రోజుల్లోనే అసలు ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరి ఇందులో ఇండియా టుడే అంచనాలు ఏ మేరకు నిజం అవుతాయో వేచిచూడాల్సిందే.